బులంద్ షహర్: నగరంలో కల్తీ మద్యం తాగి శుక్రవారం ఐదుగురు మృతి చెందారు. మరో 16 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముగ్గురు పోలీస్ అధికారులు, ఓ స్టేషన్ ఇన్ఛార్జ్ను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్ఎస్పీ తెలిపారు. అన్ని మద్యం షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రవీంద్ర కుమార్ తెలిపారు.