న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పై చర్యలు తీసుకోవాలని ఫేస్బుక్ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్). ఆదే శిం చింది. దిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల బాలిక కుటుంబ వివరాలను బహిరంగపరిచేలా ఓ ఫొటో పోస్ట్ చేసినందుకు ఈ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ‘ఇన్స్టా గ్రామ్లో రాహుల్ పోస్టు చేసిన ఓ వీడియోలో బాధిత బాలిక కుటుంబాన్ని గుర్తించేలా ఉంది. బాలిక తల్లితండ్రులు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇది నిర్దేశించిన చట్టా లను ఉల్లం ఘించడమే. జువైనల్ జస్టిస్ యాక్ట్-2015, పోక్సో చట్టం-2012, ఐపీసీలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయన ఖాతాపై చర్యలు తీసుకోవాలి. సదరు వీడి యోను వెంటనే తొలగించాల’ని సూచించింది.