లడఖ్‌లో 4.4 తీవ్రతతో భూకంపం

లడఖ్‌లో 4.4 తీవ్రతతో భూకంపం

లేహ్ (లడఖ్) : లడఖ్లోని లేహ్ లో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్స్కేల్పై 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం 8:12 గంటల సమయంలో లేహ్ లో భూకంపం సంభవించింది. వెడల్పు : 36.10, పొడవు : 74.81, 150 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది అని ఎన్సిఎస్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొంది. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos