వ్యవసాయ బిల్లుల ప్రభావం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

వ్యవసాయ బిల్లుల ప్రభావం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

న్యూ ఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత భారీ నష్టాలను చవి చూశాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండతో పాటు, రాజ్యసభలోనూ వ్యవసాయ చట్ట సవరణ ముసాయిదాలకు ఆమోదముద్ర పడటంతో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. అమ్మకాలను మొగ్గుచూపారు. బీఎస్ఈ సెన్సెక్స్ 811 పాయింట్లు కోల్పోయి 38,034కి, నిఫ్టీ 254 పాయింట్లు నష్ట పోయి 11,250కి దిగజారాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్ (-8.57%), భారతి ఎయిల్ టెల్ (-5.95%), టాటా స్టీల్ (-5.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (-5.31%), ఐసీఐసీఐ బ్యాంక్ (-5.19%) బాగా నష్ట పోయాయి. టీసీఎస్ (0.63%), ఇన్ఫోసిస్ (0.36%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (0.33%) మాత్రమే లాభాల్ని గడించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos