దిశ చట్టానికి దిగువ సభ ఆమోదం

దిశ చట్టానికి దిగువ సభ ఆమోదం

అమరావతి: మహిళల భద్రతకు ఉద్దేశించిన దిశ చట్టం శుక్రవారం శాసనసభ ఆమోదాన్ని పొందింది. ముసాయిదాను హోం మంత్రి సుచరిత ప్రవేశ పెట్టారు. సుదీర్ఘ చర్చ జరిగింది.దిశ చట్టం ప్రకారం , కొత్త చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధిస్తారు. అత్యాచార ఘటనకు సంబంధించి నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు వారం రోజుల్లోగా దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. మొత్తం 21 రోజుల్లోగా తీర్పు వెలువరించాలి. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరి చేలా పోస్ట్ లు చేస్తే సెక్షన్ 354(ఇ) కింద చర్యలు తీసుకుంటారు. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354(ఎఫ్) కింద ఐదు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos