ఢిల్లీ : అమ్మ మక్కళ్ మున్నేట్ర కజగం (ఏఎంఏకే) నాయకుడు టీటీవీ
దినకరన్కు సుప్రీం కోర్టులో మంగళవారం చుక్కెదురైంది. తమ పార్టీ గుర్తుగా వంట కుక్కర్ను
కేటాయించాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే ఆ పార్టీ తరఫున పోటీ
చేస్తున్న అభ్యర్థులందరికీ ఉమ్మడి చిహ్నాన్ని కేటాయించే అవకాశం ఉంటే పరిశీలించాలని
ధర్మాసనం ఎన్నికల సంఘానికి సూచింది. అలా కేటాయించినా, ఆ అభ్యర్థులను స్వతంత్రులుగానే
పరిగణించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా,
జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఒక పార్టీకి గుర్తింపునివ్వాలా
వద్దా అనే అంశం ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.