‘దేశం’ వారసులు వీరే

అమరావతి:తెదేపా  అభ్యర్థుల  తొలి జాబితాలో రాజకీయ నేతల వారసులకు పెద్ద పీట వేశారు. పది మంది వారసులకు పోటీకి అవకాశాన్ని కల్పించారు. చంద్రబాబు  తనయుడు మంగళగిరి నుంచి లోకేశ్ బరిలోకి దిగనున్నారు. పలాస విధానసభ సభ్యుడు  గౌతు శివాజీ కుమార్తె శిరీష, చీపురుపల్లి  ఎమ్మెల్యే మృణాలిని కుమారుడు కిమిడి నాగార్జున, రాజమండ్రి అర్బన్ నుంచి ఎర్రన్నాయుడు కుమార్తె, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవానీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. గుడివాడ నుంచి దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్, విజయవాడ పశ్చిమ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూస్, పత్తికొండ నుంచి పముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యామ్, రాప్తాడు నుంచి మంత్రి పరిటాల సునీత వారసుడిగా పరిటాల శ్రీరామ్ రంగ ప్రవేశం చేశారు. శ్రీకాళహస్తి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి నుంచి దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడి కుమారుడు గాలి భాను ప్రకాశ్ ఎన్నికల రాజకీయాల్లో కాలుమోపారు. కాగా, తొలి జాబితాలో ప్రస్తుత విధానసభ సభ్యులకు ఎక్కువ  అధిక ప్రాధాన్యత  లభించింది.  72 మంది ఓసీలు, 31 మంది బీసీలు, 17 మంది ఎస్సీలు, నలుగురు ఎస్టీ, ఇద్దరు మైనార్టీలు తొలి జాబితాలో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos