అపోహ కాదు – స్పీకర్‌ ప్రకటనే ఈ ఆందోళనకు కారణం

అపోహ కాదు – స్పీకర్‌ ప్రకటనే ఈ ఆందోళనకు కారణం

విజయవాడ : మన్యంలో జరుగుతున్న ఆందోళనలు ఎవరో దుష్ప్రచారం చేస్తేనో లేదా అపోహలు సృష్టిస్తేనో వచ్చింది కాదని, చట్టాన్ని సవరించాలని స్పీకర్‌ చేసిన ప్రకటనే ఈ ఆందోళన మొత్తానికి కారణమన్న సంగతి ముఖ్యమంత్రి గుర్తించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం దీనిపై శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. 1/70 చట్టాన్ని కొనసాగిస్తామని, జీవో నెంబర్‌ 3 పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్‌ను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆహ్వానిస్తున్నదన్నారు. ఇదే మాదిరి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి కూడా ఒక ప్రకటన చేశారని గుర్తు చేశారు. చట్టాన్ని సవరించాలని స్పీకర్‌ చేసిన ప్రకటనే ఈ ఆందోళన మొత్తానికి కారణమని ముఖ్యమంత్రి గుర్తించాలని చెప్పారు. ఇది ఎవరో దుష్ప్రచారం చేస్తేనో లేదా అపోహలు సృష్టిస్తేనో వచ్చింది కాదని స్పష్టం చేశారు. గిరిజన చట్టాలను బలహీనపరిచే ఎలాంటి ప్రకటనలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జీవో నెంబర్‌ 3 ని పునరుద్ధరించి వెంటనే స్పెషల్‌ డిఎస్సి నిర్వహించి విద్యావంతులైన గిరిజన యువతలో అశాంతిని తొలగించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos