రాష్ట్రాల అప్పులకు కేంద్రం ఆంక్షలు సరికాదు

రాష్ట్రాల అప్పులకు కేంద్రం ఆంక్షలు సరికాదు

విజయవాడ : రాష్ట్రాలు అప్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు, షరతులు విధిస్తోందని, అనుమతి ఇచ్చేందుకు అనేక మెలికలు పెట్టి అదనపు భారాలు మోపుతోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందంటూ బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు సరికాదని తప్పు బట్టారు. ఇక్కడి మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో విలేఖరులతో ఆయన మాట్లాడారు. ‘కోవిడ్ వల్ల ఏపీతోపాటు అనేక రాష్ట్రాలు అప్పులు చేయాల్సి వచ్చింది. కేంద్రం కూడా ఇందుకు అతీతం కాదు. రాష్ట్రాలు అప్పులు చేయాలంటే కేంద్రం అనుమతి తప్పని సరి. కేంద్రానికి మాత్రం షరతులు వర్తించవా? అనేక షరతులు పెట్టి రాష్ట్రాలు ప్రజలపై భారాలు మోపేలా కేంద్రం వ్యవహరిస్తోంది. అప్పుల విషయంలో కేంద్రానికి ఒక న్యాయం, రాష్ట్రానికి ఒక న్యాయం అమలు జరుగుతోంది. ఈ వాస్తవాలకు సమాధానం చెప్పకుండా పురందేశ్వరి రాష్ట్రాలపై విమర్శలు చేయడం కపటత్వం’అని విమర్శించారు. సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు, కేరళ మాజీ మంత్రి ఎం.ఎ.బేబీ మాట్లాడుతూ ప్రధాని మోదీ రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos