చెన్నై: సీపీఎం కార్యాలయాన్ని కులాంతర వివాహాలు చేసుకునే ప్రేమికులకు కళ్యాణవేదికగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పి.షణ్ముగం ఎక్స్పేజీలో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పించలేదని, వేర్వేరు కులాలకు చెందిన యవతీ, యువకులు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని తమ పార్టీ ప్రోత్సహిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరువు హత్యల నివారణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.