న్యూ ఢిల్లీ : సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు చర్యలు కొనసాగు తున్నాయి. లడఖ్లోని దెమ్చోక్లోని చార్డింగ్ నాలా వద్ద చైనా సైనికుల గుడారాల్ని భారత సైన్యం గుర్తిం చింది. చైనా పౌరులమంటూ అక్కడే ఉండడానికి ప్రయత్నించారు. అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు. అయినా వారు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. భారత్తో ఓపక్క చర్చలు జరుపుతూనే.. మరోపక్క చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. ఈ రోజు ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి కమాండర్ల సమా వేశం జరగాల్సి ఉండగా కార్గిల్ యుద్ధ విజయ దినోత్సవ కార్యక్రమాలు ఉండటంతో భారత్ దీన్ని వాయిదా వేసింది. దెమ్చోక్, ట్రిగ్హైట్స్లను 1990ల్లో ఇండో చైనా జాయింట్ వర్కింగ్ గ్రూప్ వివాదాస్పద ప్రాంతాలుగా గుర్తించింది. అక్కడ చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుండంతో భారత సైన్యం అక్కడ పహారా కాస్తోంది. ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగే వాతావరణం మాత్రం లేదని అధికారులు అంటున్నారు. ఆ ప్రాంతాల్లో రెండేళ్ల క్రితం ఉన్న నాటి పరిస్థితులు మళ్లీ నెలకొనాలని భారత్ కోరుతోంది. చైనా శాంతి వచనాలు పలుకుతూనే తన తీరును మార్చుకోకుండా రెచ్చగొట్టే చర్యలను కొనసాగిస్తోంది.