బరంపురం: స్థానిక కళాకారుడు సత్య మహారాణ కళాకారుడు అత్యంత చిన్నరథం- నందిఘోష్(జగన్నాథుడి ఊరేగింపునకు ఉపయోగించే రథం పేరు)ను తయారు చేసారు. దీని పొడవు 2.5 అంగుళాలు, వెడల్పు 2 అంగుళాలు . 16 చక్రాలు, నాలుగు గుర్రాలు, రెండు చిలకలు, రథంపైన ఓ జెండా, రథంలోపల సెంటీమీటరు పొడవున్న జగన్నాథుడి విగ్రహం ఉన్నాయి. ఈ బుల్లి రథాన్ని తయారు చేయడానికి సత్యకు నాలుగు రోజులు పట్టిందట. ‘గతంలో ఇక్కడ జరిగిన ఒక ఉత్సతవంలో సూక్ష్మ వస్తువుల తయారీ ఆరంభించాను. 2016లో చెక్క రథాలు తయారు చేశాను. నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నందిఘోష్ను రూపొందించాను’అని సత్య తెలిపారు. ఆ స్ఫూర్తితోనే ఈ ఏడాది 2.5అంగుళాల రథాన్ని తయారు చేశాన’న్నారు.