న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పక్షాలు అడ్డదారుల్లో గెలిచేందుకు ఓటర్లను ప్రలోభ పరిచే తాయిలాలు, అక్రమ నగదు పంపిణీని అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం అత్యున్నత స్దాయి సమితిని నియమించింది. సీబీడీటీ, ఈడీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, నార్కోటిక్స్, ఆర్పీఎఫ్, పౌరవిమానయాన భద్రతా విభాగాధిపతులు సమితిలో సభ్యులు.