కొనసాగుతున్న భారత్ బంద్.

కొనసాగుతున్న భారత్ బంద్.

న్యూ ఢిల్లీ: డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ శుక్రవారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగుతోంది. పంజాబ్లో బస్సులు బస్టాప్లకే పరిమితమయ్యాయి. ఢిల్లీ – నోయిడా మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణించే వారు ప్రత్యామ్నయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఢిల్లీ వైపు తరలివస్తున్న రైతులను నిలువరించేందుకు సరిహద్దు భద్రతా దళ అధికారులు 30 వేల టియర్ గ్యాస్ సెల్లను సిద్ధం చేసుకున్నారు. నిరసనలు నాలుగో రోజుకి చేరుకోవడంతో గురువారం అర్ధరాత్రి నోయిడా పోలీసులు 144 సెక్షన్ విధించారు.ఢిల్లీ – హరియాణా సరిహద్దులోని టిక్రీ, సింగు అనే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆందోళన చేస్తున్న రైతులను నిలువరించేందుకు బాష్పవాయువును, వాటర్ క్యానన్లను ప్రయోగిస్తున్నారు. బారికేడ్లు, ఇనుప మేకులు, ముళ్ల తీగలతో రైతులను అడ్డగిస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు వెనక్కి తగ్గబోమని రైతులు తేల్చి చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos