బడ్జెట్‌ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు

బడ్జెట్‌ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు

న్యూ ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభకు సమర్పించిన 2021-2022 బడ్జెట్‌ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు.

* మూలధన వ్యయం 5.34 లక్షల కోట్లు

* రీసెర్చ్ అండ్‌ డెవలప్‌ మెంట్‌ కోసం రూ. 5 వేల కోట్లు

* స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కు రూ. 3 వేల కోట్లు

* ఆరోగ్య రంగానికి 137 శాతం నిధుల పెంపు

* ఎలక్ట్రానిక్‌ పేమెంట్లను పెంచేందుకు రూ. 1,500 కోట్లు

* నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ కింద 1,500 స్కూళ్ల అభివృద్ధి

* కొత్తగా మరో 750 ఏకలవ్య పాఠశాలలు

* అదనంగా 100 సైనిక స్కూళ్ల ఏర్పాటు

* వ్యవసాయ మౌలిక నిధి ఏర్పాటు

* ఈ నిధితో మౌలిక సౌకర్యాల పెంపు

* ఒకే వ్యక్తి సార్థ్యంలోని కంపెనీలకు అనుమతులు

* ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు విధానం దేశంలో అన్ని ప్రాంతాల్లో అమలు

* వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే అవకాశం

* కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్‌

* రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల పెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థలే

* కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి

* రూ. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి

* 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరణ

* 2021-22లో బీపీసీఎల్‌, ఎయిర్‌ ఇండియా, ఐడీబీఐల అమ్మకం పూర్తి

* ఈ సంవత్సరమే ఎల్‌ఐసీ ఐపీవో

* మూలధన సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు

* మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్‌ బ్యాంక్‌

* గెయిల్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ పైపులైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ

* స్టార్టప్‌లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతం

* ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వస్‌‌థ భారత్‌ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,75,000 కోట్ల టార్గెట్‌

* రెగ్యులేటర్‌ గోల్డ్ ఎక్సే్ఛంజీల ఏర్పాటు

* ఇన్వెస్టర్‌ చార్టర్‌ ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ

* బీమారంగంలో ఎఫ్‌డీఐలు 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు

* ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థలో సంస్కరణలు

* 1938 బీమా చట్టం సవరణ. డిపాజిట్లపై బీమా పెంపు

* రూ. 3,05,984 కోట్లతో డిస్కమ్‌లకు సాయం

* రూ. 18 వేల కోట్లతో బస్‌ట్రాన్స్ పోర్ట్ పథకం

* వాహనరంగం వృద్ధి చర్యలు

* కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం

* చెన్నై మెట్రోకు రూ. 63,246 కోట్లు

* బెంగళూరు మెట్రోకు రూ.14,788కోట్లు

* 2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు

* ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్‌‌ట కోస్‌‌ట సరకు రవాణా కారిడార్‌

* రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ.1,01,055 కోట్లు

* 2023 కల్లా విద్యుదీకరణ పూర్తి

* దేశంలోనే తొలిసారిగా డిజిటల్‌ పద్ధతిలో జనాభా లెక్కలు

* జనగణనకు రూ. 3,678 కోట్ల కేటాయింపు

* ఆర్థిక రంగ పునరుత్తేజానికి రూ. 80 వేల కోట్లు

* 2021-2022 ద్రవ్యలోటు 6.8 శాతం

* 2025 నాటికి 4.8 శాతం టార్గెట్‌

* గోవా డైమండ్‌ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం రూ. 300 కోట్లు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos