తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో ఓ నాటు బాంబు పేలడం కలకలం రేపింది. గత రాత్రి ఓ శునకం నాటుబాంబును కరచుకుని ఆసుపత్రి ఆవరణలోకి వచ్చింది. చాలా సేపటి నుంచి దానిని అది గట్టిగా పట్టుకుని ఉండడంతో ఒత్తిడికి ఒక్కసారిగా పేలిపోయింది. పెద్ద శబ్దం రావడంతో ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో బాంబు కరచుకు వచ్చిన శునకం అక్కడికక్కడే మృతి చెందింది.బాంబు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ నాటుబాంబును శునకం ఎక్కడి నుంచి తెచ్చి ఉంటుందనే దానిపై ఆరా తీస్తున్నారు. .