విశాఖ విమానానికి బాంబు బెదిరింపు

విశాఖ విమానానికి బాంబు బెదిరింపు

ఢిల్లీ:ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో బాంబు ఉందంటూ ఓ వ్యక్తి ఢిల్లీ ఎయిర్ఫోర్ట్కు ఫోన్ చేసి తెలిపాడు. దీంతో అధికారులు వెంటనే విశాఖ ఎయిర్పోర్ట్ అధికారులను అప్రమత్తం చేశారు. ఆ సమయంలో విమానంలో 107 మంది ప్రయాణికులు ఉన్నారు.విమానం విశాఖ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాగానే అధికారులు ప్రయాణికుల్ని దింపేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదు. దీంతో ఆ బెదిరింపు కాల్ బూటకమని అధికారులు తేల్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos