దేశ వ్యాప్తంగా బ్లాక్డే

దేశ వ్యాప్తంగా బ్లాక్డే

న్యూ ఢిల్లీ : మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి నేటితో ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా రైతు సంఘాలు, వారి మద్ధతు దార్లు బుధవారం దేశ వ్యాప్తంగా – బ్లాక్ డే పాటిస్తున్నారు. ‘నేడు బుధ పూర్ణిమ. సమాజంలో సత్యం, అహింస జాడ కరవైంది. ఈ విలువల పునరుద్ధరణ జరిగేలా పండుగ జరుపుకోవాలని కిసాన్ మోర్చ పిలుపునిచ్చింది. ఎక్కడికక్కడ శాంతియుతంగా నిరసన తెలపాలని రైతులను కోరింది. రైతుల ఆందోళన తో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేశారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్నారని ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు పంపింది. ఆందోళన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది.బ్లాక్డే పాటింపు గురించి రైతు నేత రాకేశ్ తికాయత్ మాట్లాడారు. ‘ఎక్కడా గుంపులుగా చేరబోము. బహిరంగ సమావేశాలు ఉండవు. నల్ల జెండాలను మాత్రం ఎగురవేస్తారు. ప్రజలు ఎక్కడి వారు అక్కడే తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేయాలి. ఉద్యమం ఆరు నెలలు పూర్తి చేసుకున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకునే విషయంలో స్పందించడం లేద’ని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos