ఇక మీకు గడ్డు రోజులే.. నికోబార్‌ ఓటర్లకు బీజేపీ ఎంపీ బెదిరింపులు

ఇక మీకు గడ్డు రోజులే.. నికోబార్‌ ఓటర్లకు బీజేపీ ఎంపీ బెదిరింపులు

న్యూఢిల్లీ: ‘యాదవులు, ముస్లింలు నాకు ఓటేయలేదు. వారి కోసం పనిచేయను’ అంటూ జేడీయూ ఎంపీ దేవేశ్ చంద్ర ఠాకూర్ ఇటీవలి వ్యాఖ్యలు వివాదాస్పదంగా కాగా, తాజాగా అండమాన్ నికోబార్ బీజేపీ ఎంపీ బిష్ణుపాద రాయ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నికోబార్ ప్రజలు తనకు ఓటేయలేదని, వారికి గడ్డు రోజులు మొదలైనట్టేనని రాయ్ బెదిరింపులకు దిగారు. లోక్సభ ఎన్నికలు ఓట్ల లెక్కింపు జరిగిన మరునాడు ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయగా, ఇందుకు సంబంధించిన వీడియో తాజా వైరల్ అయ్యింది. ‘నికోబార్ పేరుతో మీరు డబ్బులు తీసుకుంటారు. మందు తాగుతారు. ఓట్లు మాత్రం వేయరు. జాగ్రత్త.. మీకు గడ్డురోజులు ప్రారంభమైనట్టే. మీ భవిష్యత్తు ఎంతమాత్రం ఆశాజనకంగా ఉండదు’ అంటూ ఆయన ఓటర్లను హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos