భాజపాకు ఒక్క ఎన్సీపీ నేత మద్దతూ లేదు

భాజపాకు ఒక్క ఎన్సీపీ నేత  మద్దతూ లేదు

ముంబై:శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శనివారం ఇక్కడ పేర్కొన్నారు. తమ మూడు పార్టీలకూ కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ ఉందని, కొందరు స్వతంత్ర అభ్య ర్థులతో కలిసి మొత్తం 170 మంది ఎమ్మెల్యేలు తమ వద్ద ఉన్నారని వివరించారు. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో కలిసి ఆయన ముంబయిలోని వైబీ చవాన్ సెంటర్ లో విలేఖరులతో మాట్లాడారు. ‘మా పార్టీకి వ్యతిరే కంగా అజిత్ పవార్ వ్యవహరించారు. హద్దులు మీరారు. ఎన్సీపీ నుంచి ఒక్క నేత కూడా భాజపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా లేరు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉందనే విషయాన్ని ఎమ్మెల్యేలందరూ గుర్తుంచుకోవాలి. శాసనసభ్య సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. నిజమైన ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ భాజపాతో చేతులు కలపబోర’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos