వేల ఎకరాల బాబు బినామీ భూములు

అమరావతి: రాజధాని నగరం అమరావతిలో30,000 ఎకరాల స్థలం చంద్రబాబు బినామీలు, బంధుగణం చేతిలోనే ఉందని వైకాపా ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి గురువారం ట్విట్టర్లో ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా ఈ భూమిని చంద్రబాబు వారికి కట్ట బెట్టారని వివరించారు. త్వరలో వీరంతా రోడ్డున పడతారని చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే ‘అమరావతిని ఖూనీ చేశారు. రియల్ ఎస్టేట్ ధరలు పతనమయ్యాయి’ అంటూ ఆయన గింజుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos