చెన్నై: బంగాళాఖాతంలో మంగళవారం మధ్యాహ్నం 12.23 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. తీవ్రత 5.1గా భూ కంప మాపనంపై నమోదైంది. చెన్నైలో స్వల్పం గా భూమి కంపించింది. భూ కంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు-ఈశాన్య దిశలో 320 కి.మీల దూరంలో ఉన్నట్టు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సీస్మాలజీ వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్ పై భూకంపం ఎటువంటి ప్రభావం చూపలేదని రాష్ట్ర విపత్తుల శాఖ తెలిపింది.