న్యూ ఢిల్లీ:పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్కు చెందిన కొందరు దుండగులు భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్ను అపహరించి, కొన్ని గంటల పాటు బందీగా ఉంచుకున్నారు. బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళంతో చర్చలు జరపడంతో ఆ జవాన్ సురక్షితంగా విడుదలయ్యాడు.