తిరుమల: సమాజంలోని ఆర్థిక అసమానతలను తగ్గించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక అసమానతలు తగ్గించడం ప్రభుత్వం వల్ల, ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే సాధ్యమని చెప్పారు. ఒకతనికి లక్ష కోట్లు.. మరొకతనికి రోజుకు వంద రూపాయలు వచ్చే పరిస్థితి ఉండకూడదని వివరించారు. ప్రజలంతా మెరుగైన జీవనప్రమాణంతో ఉండాలని, సరైన ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే ఇది సాధ్యమని చెప్పారు. భారత దేశంలోని కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని చంద్రబాబు చెప్పారు.