అయోధ్య విచారణ వ్యవధి పెంపు

అయోధ్య విచారణ వ్యవధి పెంపు

న్యూ ఢిల్లీ: అయోధ్య భూ వివాద విచారణను గడువులోగా ముగించేందుకు మరో గంట పాటు ఎక్కువ పని చేస్తామని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది. వచ్చే సోమవారం నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాదనలు ఆలకిస్తామని వివరించింది. ‘సెప్టెంబరు 23 నుంచి మరో గంటసేపు ఎక్కువగా కూర్చుంటాం. రోజువారీ వాదనల సమయాన్ని సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు పెంచుతు న్నామ’ని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. విచారణను అక్టోబరు 18లోగా ముగిం చాలని ఇటీవల న్యాయస్థానం నిర్ణయించింది. గడువులోగా వాదనలు ముగిస్తే నవంబరు మధ్యలో తీర్పు వెలువడ వచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos