లడాఖ్: సంతానం కోసం విదేశాల నుంచి యువతులు లడఖ్కు క్యూ కడుతున్నారంట. పిల్లల కోసం విదేశీ యువతులు ఇక్కడకు రావడమేంటని అనుకుంటున్నారా. అవును కేవలం గర్భం దాల్చడం కోసమే యురోపియన్ దేశాలకు చెందిన అమ్మాయిలంతా లడాఖ్కు వస్తున్నారంట. అయితే ఇందులో ఓ రహస్యం ఉంది. అదేంటంటే.. లడాఖ్లో ఆర్యన్ సంతానం నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్యన్లు అంటేనే ఆరు అడుగుల ఆజానుబాహులు, నీలి కళ్లు కలిగి అందంగా ఉంటారు. దీంతో ఆర్యన్ సంతానాన్ని పొందడానికి యురోపియన్ అమ్మాయిలు లడాఖ్కు ప్రతి ఏటా వందల సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఆరు అడగుల ఆజానుబాహులుగా కనిపించే ఆర్యన్ అబ్బాయిలతో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల నుంచి ప్రతి ఏటా అమ్మాయిలు ఇక్కడికి వచ్చి శృంగారంలో పాల్గొని ఆర్యన్ సంతానం పొందుతున్నారు. సంతానం కోసమే ప్రత్యేకంగా విదేశీ యువతులు లడాఖ్కు వస్తుండటంతో ఆర్యన్ వాలీకి ‘ప్రగ్రెన్సీ టూరిజం’ అని పేరు కూడా పెట్టారు. చరిత్ర ప్రకారం.. క్రీస్తు పూర్వం గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సింధూ లోయకు వచ్చిన అలెగ్జాండర్.. ఆ తర్వాత ఇండియాకు రాకుండానే వెనుదిరిగాడు. కానీ అతని వెంట వచ్చిన సైన్యంలో కొంత మంది సింధు లోయ వద్ద ఉండిపోయారంట. ఇక అప్పటి నుంచీ సింధూ లోయలో నివసిస్తున్న వీళ్లనే ఇప్పుడు చివరి ఆర్యన్లుగా పిలుస్తున్నారు. లఢాఖ్లోని ఐదు గ్రామాల్లో చివరి ఆర్యన్లు నివసిస్తున్నారు. నియంత్రణ రేఖకు సమీపంలోనే ఈ గ్రామాలు ఉన్నాయి.