అంబులెన్స్‌లను నిలిపేసిన తెలంగాణ పోలీసులు.. ఒకరి మృతి

అంబులెన్స్‌లను నిలిపేసిన తెలంగాణ పోలీసులు.. ఒకరి మృతి

మహబూబ్నగర్ :పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్సులను సరిహద్దుల వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. బాధితులు బతిమాలినా ప్రయోజనం లేదు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సరిహద్దులోని పుల్లూరు టోల్ప్లాజా వద్ద వందకుపైగా అంబులెన్సులు నిలిచి పోయాయి.రోగికి అత్యవసరంగా చికిత్స అందించాల్సి ఉందని, దయచేసి విడిచిపెట్టాలని కోరినప్పటికీ పోలీసులు అనుమతించకపోవడంతో ఒక అంబు లెన్సులోని రోగి శుక్రవారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతాలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చేసేది లేయి రోగి బంధువులు మృతదేహాన్ని తీసుకుని వెనక్కి వెళ్లిపోయారు. పొరుగు రాష్ట్రాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగులకు అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆసుపత్రల్లో బెడ్ రిజర్వేషన్ ఉంటేనే అనుమతిస్తామని స్ఫష్టం చేసింది. ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos