‘రజనీ వచ్చినా మా ఓటు బ్యాంకుకు ఢోకా లేదు’

‘రజనీ వచ్చినా మా ఓటు బ్యాంకుకు ఢోకా లేదు’

చెన్నై : నటుడు రజనీకాంత్ రాజకీయ ప్రవేశం వల్ల తమ ఉనికికి ముప్పు లేదని అన్నాడీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి, మాజీ మంత్రి సి.పొన్నయ్యన్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ శాసనసభ ఎన్నికలకు అన్ని పార్టీలకంటే ముందు గా అన్నాడీఎంకే ఏర్పా ట్లన్నీ ముగించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎడప్పాడిని ప్రకటించింది. ప్రస్తుతం ఎన్నికల ప్రణాళిక తయారవుతోంది. రజనీకాంత్ దశాబ్దాల తరబడి పార్టీ పెడతానంటూ చెబుతూ వచ్చారు. పార్టీ ప్రారంభించిన తర్వాతే ఆయన ఆశయాలు, లక్ష్యాలు సమగ్రంగా తెలుసుకోవడానికి వీలుపడుతుంది. రజనీ పార్టీయే కాదు. ఏ ఇతర పార్టీల్లా అన్నాడీఎంకేకు ఎలాంటి నష్టం కలగదు. అన్నాడీఎంకేని రజనీ పార్టీ ఉండే ఓడించే ప్రసక్తే లేదు. రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలు స్థాపిస్తానని చెప్పడం కూడా విడ్డూరంగా ఉంది. ఆర్ఎస్ఎస్ భావాలను పుణికిపుచ్చుకున్న రజనీకాంత్ ద్రావిడ సిద్ధాంతాలను పెంచిపోషిస్తున్న తమిళనాట ఎలాంటి మార్పులు తీసుకురాలేరు. అన్నాడీఎంకే కూటమి నుంచి ఏ మిత్రపక్షమూ వైదొలగ లేదు. కూటమి బలంగానే కొనసాగుతోందన్నారు. ఎన్నికల్లోగా కొత్త పార్టీలు కూటమిలో చేరే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్ఠానం ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సీనియర్ నాయకులంతా సమవేశమై అభ్యర్థులను ఎంపిక చేస్తారు. శశికళ మరో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. ఆమెకు అన్నాడీఎంకేకు ఎలాంటి సంబంధాలు లేవు. ఆమె జైలు నుండి విడుదలైనా రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు సంభవించ వ’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos