ఫిదా బ్లాక్బస్టర్ అనంతరం రెండేళ్లపాటు విరామం తీసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల మరోసారి అందమైన ప్రేమకథతోనే ప్రయోగం చేయబోతోన్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి, నాగ చైతన్యలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా చకచకా జరిగిపోతోంది. ఈ క్రమంలోనే రియలిస్టిక్గా ఉండాలని ఓ ప్రయోగం కూడా చేశాడు.సన్నివేశం సహజంగా ఉండాలని, రియలిస్టిక్ ఫీలింగ్ తీసుకువచ్చేందుకు జనం తిరిగే ప్రదేశాల్లోనే సీన్ తీయాలని శేఖర్ కమ్ముల అనుకున్నాడట. దీని కోసం నగరంలోని పద్మారావ్ నగర్ను ఎంచుకున్నాడు. రోడ్డుపై నడుస్తూ.. ఓ ఇంట్లోకి సాయి పల్లవి వెళ్లే సీన్ అది. అయితే వారు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి.రోడ్డుపై సాయి పల్లవిని చూసిన అభిమానులు ఊరికే ఉంటారా.. ఆ సీన్స్ను తమ ఫోన్లో బంధించారు. రోడ్డుపై నడుస్తూ గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంట్లోకి వెళ్లే సీన్ కాస్త.. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.దీంతో ఈ వీడీయో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారగా దీనిపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు..
Viral clip : #SaiPallavi Spotted in PadmaRaoNagar for Shekar Kammula's Film Shooting. pic.twitter.com/4pqOBiAeMY
— Mahanati (@Mahanatiii) December 25, 2019