అహ్మదాబాద్​లో కూలిన విమానం

అహ్మదాబాద్​లో కూలిన విమానం

అహ్మదాబాద్: ఇక్కడి  ఎయిర్​పోర్టు సమీపంలో ఎయిర్​ఇండియా విమానం కూలిపోయింది. విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు.. విమాన పైలెట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్​కు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉన్నట్లు తెలిపారు. ఎయిర్​ఇండియా B787 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఘటన జరిగింది. అహ్మదాబాద్​లోని మేఘనినగర్ ప్రాంతానికి సమీపంలోని ధార్పూర్ వద్ద ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం విమానం నుంచి భారీ పొగలు రావడంతో అటు ఎయిర్​ఇండియా, ఇటు ఎయిర్​పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos