ఆడ్వాణీకి మళ్లీ అస్వస్థత

ఆడ్వాణీకి మళ్లీ అస్వస్థత

న్యూ ఢిల్లీ : భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉపప్రధాని లాల్కృష్ణ అడ్వాణీ(96) మళ్లీ ఆస్పత్రిలో చేరారు. బుధవారం రాత్రి 9గంటల సమయంలో దిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, గత వారం ఎయిమ్స్లో చేరి చికిత్స తీసుకున్నారు. ఒక రోజు తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆడ్వాణీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన నిపుణుల బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు ఆస్పత్రివర్గాలు తెలిపాయి. సీనియర్ న్యూరోలాజీ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి సమక్షంలో ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నాయి. కానీ, ఆడ్వాణీ ఆరోగ్య సమస్య ఏమిటన్నది వెల్లడించలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos