బెంగళూరు : చంఢీగఢ్కు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ హీన జైస్వాల్ భారతీయ వాయు సేన మొదటి మహిళా ఫ్లైట్ ఇంజనీర్గా నియమితులయ్యారు. నిరుటి వరకూ భారత వైమానిక దళంలో పురుషులే ఉన్నారు. 2015 జనవరిలో భారత వాయు దళానికి (ఐఎఎఫ్) చెందిన ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నత స్థాయి కోర్సులో ఎంపికైన మొదటి మహిళగా ఆమె రికార్డు సాధించింది. గత శుక్రవారం యలహంక వాయు
స్థావరం 112 హెలికాప్టర్ యూనిట్లో ఆరు నెలల కోర్సును పూర్తి చేసుకుంది.. సియాచెన్ గ్లాసియర్స్, అండమాన్ సముద్రాల వరకు అన్ని రకాల పరిస్థితులలో ఒత్తిడితో కూడిన విధుల్ని ఆమె
నిర్వహించాల్సి ఉంటుంది. విమానం సంక్లిష్ట వ్యవస్థల నిరంతర పర్యవేక్షణ, తదితరాలు ఆమె ప్రధాన విధి నిర్వహణ.