అంగారక గ్రహంపైకి అమెరికా అంతరిక్షపరిశోధన సంస్థ నాసా దశాబ్ధమున్నర కిందట ప్రయోగించిన ఆపర్ట్యూనిటీ రోవర్ కథ ముగిసింది. నిరుడు అంగారక గ్రహంపై సంభవించిన భారీ ఇసుక తుపానులో చిక్కుకున్న రోవర్ గత ఎనిమిది నెలలుగా చలన రహితంగా మారింది. ‘దానిని తిరిగి పనిచేయించేందుకు 800 సార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో దాని కథ ముగిసినట్లు నాసా తెలిపింది. దీంతో 2020లో మరో కొత్త రోవర్ను అరుణ గ్రహం పైకి పంపనున్నట్టు తెలిపింది.