లక్నో: “నిజం ఎప్పటికైనా నిజమే. ప్రధాని నరేంద్రమోదీ అందరినీ కలుపుకొని పోతున్నారు, ఆయన మళ్లీ ప్రధాని కావాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ నిజం పలికారు. ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ కూడా ఈ వాస్తవాన్ని అంగీకరిస్తే బాగుంటుంది. తండ్రి బాటను అనుసరించాలని “ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హితవు పలికారు. ములాయం బుధవారం లోక్సభలో ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. సాక్షాత్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పక్కన ఉండగానే ములాయం ఇలా వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ శ్రేణులతోపాటు సమాజ్వాదీ పార్టీ శ్రేణులు ఖంగుతిన్నాయి. వెంటనే స్పందించిన ఎస్పీ వర్గాలు తమ పార్టీ అధినేత అఖిలేష్గాని, ములాయం కాదంటూ ఈ వ్యాఖ్యలను ఖండించారు. ములాయం వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించడంతో బీజేపీ శ్రేణులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నాయి. యోగి ఆదిత్యనాథ్ మరో అడుగు ముందుకువేసి ఈ విషయాన్ని అఖిలేష్ కూడా గుర్తించాలని ఉచిత సలహా ఇచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలతో జట్టుకట్టిన అఖిలేష్కు ములాయం వ్యాఖ్యలు పిడుగు పాటని రాజకీయ పండితులు వ్యాఖ్య.