చుట్టుముట్టిన
ఆర్థిక ఇబ్బందులు,ఆదుకోవాలంటూ లేఖ రాసినా యజమాన్యం స్పందించకపోవడంతో మనస్తాపానికి
గురై హెరిటేజ్ సంస్థ డిస్ట్రబ్యూటర్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సోమవారం ఒంగోలు
పట్టణంలో చోటు చేసుకుంది.ప్రకాశ్ జిల్లా ముండ్లుమూరు మండలం పోలవరం గ్రామానికి
చెందిన హరిబాబు(48)2012వ సంవత్సరంలో రూ.2.8లక్షలు మొత్తాన్ని డిపాజిట్ చేసి
హెరిటేజ్కు చెందిన పాలు తదితర ఆహారపదార్థాల కారీయింగ్ అండ్ ఫార్వార్డింగ్
డిస్ట్రబ్యూటర్గా చేరారు.అప్పటి నుంచి కుటుంబంతో సహా ఒంగోలు పట్టణంలోనే నివసిస్తూ
హెరిటేజ్ ఉత్పత్తులను ఏజెంట్లకు సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్నారు.అయితే
డిస్ట్రిబ్యూటర్గా చేరిన సమయంలో డిపాజిట్ చేసిన రూ.2.8లక్షలకు అదనంగా మరికొంత
మొత్తాన్ని డిపాజిట్ చేయాలంటూ హెరిటేజ్ యజమాన్యం హరిబాబుపై ఒత్తిడి
చేయసాగింది.దీంతో అదనపు మొత్తం కోసం ప్రయత్నిస్తుండగానే డిపాజిట్ చెల్లించని
కారణంగా ఉత్పత్తుల సరఫరా నిలిపివేస్తున్నట్లు హెరిటేజ్ యజమాన్యం హరిబాబుకు మెయిల్
పంపింది.దీంతో హతాశుడైన హరిబాబు కంపెనీ ప్రతినిధులను ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో
మరుసటి రోజే నారా భువనేశ్వరి,బ్రాహ్మిణిలకు తన పరిస్థితిని వివరిస్తూ లేఖ
రాసారు.ఉత్పత్తుల సరఫరా నిలిపివేస్తే ఆర్థికంగా చితికిపోతానని కుటుంబంతో సహా
రోడ్డున పడతానని లేఖలో పేర్కొన్నారు.ఇతర కంపెనీలతో పోలిస్తే హెరిటేజ్లో తక్కువ
ప్రోత్సాహకం ఇస్తున్నా తెదేపాపై అభిమానంతో పని చేస్తున్నానని కూడా లేఖలో
పేర్కొన్నారు.అయితే హరిబాబు లేఖకు సంస్థ నుంచి కాని నారా భువనేశ్వరి,బ్రాహ్మిణిల
నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై మరణ వాంగ్మూలం రాసి
ఆత్మహత్యకు పాల్పడ్డారు.బకాయిలు ఆగిపోవటం, డిపాజిట్ వెనక్కు ఇవ్వకపోవడంతో బయట ముఖం చూపించలేకపోతున్నానని, ఆత్మహత్యే శరణ్యమని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. కంపెనీ తనను తీసేయడంతో అప్పుల పాలై చివరికి తన 3.5 ఎకరాల పొలం అమ్మి కొంతమేర బాకీలు తీర్చాడు. ఈ నేపథ్యంలో శనివారం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి ముందు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. బంధువులు అద్దంకిలోని ఆస్పత్రికి తరలించగా> అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. ఘటనాస్థలంలో లభించిన ఆనవాళ్లను బట్టి మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.