నల్గొండ : బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేరగాడికి 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇన్ఛార్జి జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై 2021లో తిప్పర్తి పీఎస్లో మహ్మద్ ఖయ్యూమ్ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు కొనసాగగా.. తాజాగా తీర్పు వెల్లడైంది