ఢిల్లీ : వీధుల్లో కుక్కలు కనిపించరాదని సుప్రీంకోర్టు సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించటం మనం రోజు రోజుకూ సైన్స్, మానవత్వం లేని ప్రాచీన యుగంలోకి వెళ్లిపోతున్నట్లు ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘మూగజీవాలైన కుక్కలు సమాజంలో పెద్ద సమస్య కాదు. వాటిని పూర్తిగా నిర్మూలించడం సరైన చర్య కాదు. ప్రజలకు భద్రత కల్పించాలనుకుంటే వాటికి స్టెరిలైజేషన్, టీకాలు వేయడం వంటి చర్యలు తీసుకోవాలి’ అని ఎక్స్లో పోస్టు పెట్టారు.