న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మంగళ వారం సంచలన తీర్పునిచ్చింది. జీవితకాల శిక్ష అనుభవించి, శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న దోషులను విడిచి పెట్టాలని ఆదేశించింది. సుఖ్దేవ్ పెహల్వాన్ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును ఇచ్చింది. 2002లో జరిగిన నితీశ్ కటారా మర్డర్ కేసులో సుఖ్దేవ్ దోషిగా శిక్షను అనుభవించాడు. అయితే 20 ఏళ్ల శిక్షాకాలాన్ని అతను పూర్తి చేసుకున్నాడని, అతన్ని జైలు నుంచి రిలీజ్ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.