న్యూఢిల్లీ: డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీ ని అరెస్టు చేశారు. జూలై 5న అతన్ని అమెరికాలో బంధించారు. సీబీఐ, సీడీ సమర్పించిన అప్పగింత అభ్యర్థన ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని అతిపెద్ద డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ ను మోసం చేసినట్లు నేహల్ మోదీపై కేసు నమోదు అయ్యింది. మల్టీ లేయర్ స్కీమ్ రూపంలో సుమారు 19 కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమెరికా కంపెనీ నుంచి తప్పుడు కారణాలతో డైమెండ్లను తీసుకున్నాడని, కానీ ఆ డీల్ ఎప్పటికీ జరగలేదని ఆరోపణలు వస్తున్నాయి. పేమెంట్ ఒప్పందాలను నేహల్ ఉల్లంఘించాడు. కానీ ఆ డైమెండ్లను తన స్వంత లబ్ధి కోసం అమ్మినట్లు తెలుస్తోంది.