న్యూ ఢిల్లీ:విశాఖలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. గతంలో ఫిల్మ్సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని జగన్ సర్కార్ సురేశ్ ప్రొడక్షన్స్కు అనుమతి లిచ్చింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రామా నాయుడు స్టూడియోకి షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీన్ని సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం కుదరదని తేల్చి చెప్పింది. అవసరమనుకుంటే ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. మరోవైపు పిటిషన్ను ఉపసంహరించుకుంటామని సురేశ్ ప్రొడక్షన్స్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేసింది. ఇందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.