
చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే)కు ‘ప్రెషర్ కుక్కర్’ గుర్తును కేటాయించేలా ఆదేశాల్విలేమని సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది. ప్రస్తుత తరుణంలో తాము ఆ పని చేయలేమని వెల్లడించింది. ఏఎంఎంకే పార్టీకీ ‘ప్రెషర్ కుక్కర్’ గుర్తు ఇవ్వాలని గత మార్చి 9న చైన్నై హైకోర్టు ఎన్నికల కమిషన్కు సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై పళనిస్వామి వర్గం సుప్రీం తలుపు తట్టింది. అయితే, ఎమ్మెల్యేల అనర్హత కారణంగా ఖాళీ అయిన 18 స్థానాల్లో నాలుగు వారాల్లోగా ఈసీ ఎన్నికలు నిర్వహించగలిగితే హైకోర్టు సూచించిన విధంగా దినకరణ్ పార్టీకి ఈసీ ప్రెషర్ కుక్కర్ గుర్తును కేటాయించాలని తెలిపింది. లేనిపక్షంలో ఎన్నికల కమిషన్ త
మ ఇష్టానుసారం ఏఎంఎంకే పార్టీకి గుర్తును కేటాయిస్తుందని పేర్కొంది.