సురానా వైర్స్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

సురానా వైర్స్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

నాచారం : నాచారం పీఎస్‌ పరిధిలో ఉన్న సురానా వైర్స్‌ పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలు అదుపులోకి తెచ్చారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల పరిశ్రమల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలతో భారీగా ఆస్తినష్టం సంభవిస్తుండటంతోపాటు ప్రాణనష్టం కూడా అధికంగానే ఉంటుంది. యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోవడం.. భద్రతాప్రమాణాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఇందుకు కారణం. పారిశ్రామిక వాడలు ప్రమాదాలకు కేరాఫ్‌గా మారాయి. ఆయా పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలతోపాటు బీహార్‌, గుజరాత్‌, ఒడిశా, తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ముఖ్యంగా పటాన్‌చెరు, జిన్నారం, ఐడీఏ బల్లారం, కంది, హత్నూర, సదాశివపేట తదితర మండలాల్లో భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో తరచూ అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు జరుగుతున్నాయి. దీంతో కార్మికుల భద్రత సవాలుగా మారుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos