ఈ కామర్స్‌లో నిలబడతాం-ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి

  • In Money
  • February 6, 2019
  • 925 Views
ఈ కామర్స్‌లో నిలబడతాం-ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో  కల్యాణ్‌ కృష్ణమూర్తి

ముంబై : వాల్‌మార్ట్‌ ఫ్లిప్‌కార్ట్‌ నుంచి వైదొలగుతుందనే వార్తలను  ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి ఖండించారు. ప్రతికూల త కారణంగా  ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌ పెట్టుబడులు ఉపసంహరించుకోవచ్చన్న మోర్గాన్ స్టాన్లీ నివేదికను  తిరస్కరించారు. ఈ మేరకు  ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో ఉద్యోగులకు  ఈ మెయిల్‌ అందించారు. మోర్గాన్‌ స్టాన్లీ రిపోర్టు అవాస్తమని భవిష్యత్తులో తేలిపోతుందని, భారతదేశంలో ఈ కామర్స్‌ వ్యాపారానికి వాల్‌మార్ట్‌ కట్టుబడి వుందని స్పష్టం చేశారు. భారతీయ ఈ కామర్స్‌ బిజినెస్‌లో ఫ్లిప్‌కార్ట్‌ ముందు వరుసలో నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వాల్‌మార్ట్‌ ఒప్పందం దీర్గకాలిక దృష్టితో చేసుకున్నదని, ఈ నేపథ్యంలో స్వల్పకాలిక అడ్డంకులు సంస్థను ప్రభావితం చేయలేవని ఆయన వ్యాఖ్యానించారు. దేశీయంగా ఈ-కామర్స్ కంపెనీలకు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నూతన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి  తీసుకొచ్చిన నేపథ్యంలో వాల్‌మార్ట్‌  ఈ డీల్‌ నుంచి వైదొలగనుంచి  పేర్కొంది.  2017లో చైనాలో అమెజాన్‌కు దాపురించిన పరిస్థితే దేశీయంగా వాల్‌మార్ట్‌కు రానుందని నివేదించింది.  ఫ్లిప్‌కార్ట్‌ నష్టాలు 20నుంచి 25శాతానికి  పెరగొచ్చనీ,దరిమిలా వాల్‌మార్ట్‌ పలాయనం చిత్తగించక తప్పదని వ్యాఖ్యానించింది. ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్.. 16 బిలియన్ డాలర్లతో  77శాతం వాటాను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos