అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం

అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం

అయోధ్య: బాల రాముడికి బయటి సంస్థలు తయారుచేసిన ప్రసాదాలను నైవేద్యంగా పెట్టడంపై నిషేధం విధించారు. ఆలయ పూజారుల సమక్షంలో తయారుచేసిన ప్రసాదాలనే  నైవేద్యంగా పెట్టాలని, భక్తులకు ప్రసాదంగా అందించాలని నిర్ణయించామని  ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న నెయ్యి స్వచ్ఛతపై సత్యేంద్ర దాస్‌ అనుమానం వ్యక్తం చేశారు. ‘దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలు, మఠాల్లో బయట ఏజెన్సీలు తయారు చేసిన ప్రసాదాలను పూర్తిగా నిషేధించాలి. దేవుళ్లకు ప్రసాదం ఆలయ అర్చకుల పర్యవేక్షణలోనే తయారు చేయాలి. అటువంటి ప్రసాదాన్ని మాత్రమే సమర్పించాలి’ అని అన్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos