న్యూఢిల్లీ : దేశంలో చక్కెర ధరలు పెరగనున్నాయి. 2024-25 సీజన్ ( అక్టోబర్-సెప్టెంబర్)కు సంబంధించి చక్కెర, ఇథనాల్ కనీస విక్రయ ధర (ఎంఎస్పీ) పెంచాలని కేంద్రం నిర్ణయించడంతో చక్కెర ధర పెరగనుంది. ‘చక్కెర కనీస విక్రయ ధరను పెంచాలన్న ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్నాం. అలాగే ఇథనాల్ ధరను కూడా పెంచుతాం. అని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.