బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ అతివృష్టి బాధితులను ఆదుకు నేందుకు ఇక్కడి విజన్ విద్యా సంస్థల నిర్వహకులు ఇడమకంటి లక్ష్మి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయల విరాళాన్ని వితరణ చేశారు. ఆ మొత్తానికి చెక్కును ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు అందించారు. ఆయన వెంట తాళ్ళూరు మండల వైస్ యం.పి.పి ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రవాసాంధ్రులు తమ వంతు సాయాన్ని అందించాలని ఈ సందర్భంగా వారు పిలుపు నిచ్చారు.