న్యూ ఢిల్లీ: లోక్సభలో మంగళవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్రపతి ప్రసంగించారు. చర్చలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇండియా కూటమిదే నైతిక విజయమన్నారు. ఓడిపోయిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఎద్దెవా చేశారు. 2024 ఫలితాల ద్వారా భారతదేశ ప్రజలు బాధ్యతతో కూడిన సందేశాన్ని ఇచ్చారన్నారు. ఓటర్లకు అఖిలేష్ యాదవ్ అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో మతతత్వ రాజకీయాలు ఓడిపోయాయన్నారు. భారత రాజ్యాంగాన్ని సంరక్షించుకునేందుకు దేశ ప్రజలు ఓటు వేశారన్నారు. ప్రభుత్వ అహంకారాన్ని ప్రజలు ఓడించారన్నారు. ఈ ఎన్నికల్లో విభజన రాజకీయాలను ప్రజలు తిరస్కరించారన్నారు.
యూపీలో అవినీతి..!
ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి పేరుతో అవినీతి జరుగుతోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. కేంద్రప్రభుత్వం అన్ని అవాస్తవాలు చెబుతోందన్నారు. ఇండియా కూటమి అధికారం చేపడితే తక్షణమే అగ్నివీర్ వ్యవస్థను రద్దు చేస్తామన్నారు. ఇండియా కూటమి అగ్నివీర్ను వ్యతిరేకిస్తోందన్నారు. ఎంతోమంది యువత ఆకాంక్షలను అగ్నివీర్ నెరవేర్చడం లేదన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందన్నారు.