వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఓపెనర్ శిఖర్ ధావన్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. గతంలో శ్రీలంకతో సిరీస్కు ధావన్ నాయకత్వం వహించాడు.
రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్గా అవకాశం దక్కింది. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో అదరగొట్టిన దీపక్ హుడా విండీస్ వన్డేలకు ఎంపికయ్యాడు. సంజూ శాంసన్ సైతం మరోసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. యువ బౌలర్ అర్షదీప్ సింగ్కు కూడా అవకాశం దక్కింది.
జులై 22న మొదటి వన్డేతో టీమిండియా- వెస్టిండీస్ మధ్య సిరీస్ ఆరంభం కానుంది.
వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు:
శిఖర్ ధావన్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్. కాగా జులై 22, 24, 27 తేదీల్లో వన్డే పోటీలుంటాయి. టీ20 మ్యాచ్లు జులై 29, ఆగస్టు 1, 2, 6, 7 తేదీల్లో జరుగుతాయి.