న్యూ ఢిల్లీ : ఆసుపత్రి పడకలపై 5 శాతం జీఎస్టీని విధించడం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.5,000కు పైగా చార్జీ ఉండే పడకలకు ఇన్ పుట్ క్రెడిట్ ట్యాక్స్ సదుపాయం లేకుండా పన్నును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. పేదలు, మధ్యతరగతి వారిపై ఇది భారం మోపుతుందని, నాణ్యమైన వైద్యాన్ని దూరం చేయడం అవుతుందన్నారు. హెల్త్ కేర్ సంస్థల సమాఖ్య న్యాట్ హెల్త్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. ‘‘కీలకమైన వైద్య సేవలపై కేవలం నామ మాత్రపు జీఎస్టీని విధించాలి. అదే సమ యంలో హెల్త్ కేర్ సంస్థలు వినియోగించే ముడి వస్తువులపై జీఎస్టీని తగ్గించాలి. అప్పుడు నాణ్యమైన వైద్య సేవలు మరింత అందుబాటు ధరలకు వస్తాయి’’ అని సూచిం చారు. దేశంలో హెల్త్ కేర్ సేవలను జీఎస్టీ కిందకు తీసుకురావడం ఇదే మొదటిసారి.