దేశానికి ఇప్పుడు ఐక్యత కావాలి

దేశానికి ఇప్పుడు ఐక్యత కావాలి

కోల్కతా: ‘ప్రస్తుత దేశ పరిస్థితులను చూస్తుంటే భయంగా ఉంది. దేశీయుల మధ్య ఐక్యత లోపించింది. మునుపటిలా ఐక్యంగా ఉండాల’ని నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్ దేశ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇక్కడి సాల్ట్ లేక్లో అమర్త్యసేన్ పరిశోధనా కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘దేని కైనా భయపడు తు న్నారా అని నన్ను అడిగితే, అవును, భయపడుతున్నాననే చెప్తాను. ఆ భయానికి కారణం ఉంది. దేశంలోని ప్రస్తుత పరిస్థితి నా భయం వెనుకున్న కారణం. ఎందు కంటే దేశం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది సహనానికి సంబంధించిన విషయం కాదు. దేశం మునుపటిలా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. భారతదేశం కేవలం హిందువులది మాత్రమే కాదు. ముస్లింలే ఈ దేశాన్ని రూపొందించలేరు. అందరూ ఐక్యంగా ఉండి నిర్మించుకోవాలి. ఎన్నికల్లో గెలిచినంత మాత్రానా దేశంలోని బహుళత్వాన్ని తుడి చిపెట్టే అధికారాన్ని పొందినట్టు కాదు. దేశంలో ముస్లిం ప్రభావాన్ని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ సత్యాన్ని తారుమారు చేయ లేరనే విషయం మనందరికీ తెలుసు. భారతీయ చరిత్రలో మొఘలుల ప్రభావం ప్రధానమైనదే. ఈ దేశం ఆర్యభట్టు దేశమని, సైన్స్ సాధనలో యావత్ ప్రపంచానికి ఆద ర్శం గా నిలుస్తున్న దేశం. అందరూ దేశ సంప్రదాయాలకు అనుగుణంగా ఐక్యంగా ఉండాల’ని అమర్త్యసేన్ పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos